రకుల్ ప్రీత్ సింగ్ కరోనాతో బాధపడుతున్నా అవి మాత్రం మానలేకపోతోందట ..?

రకుల్ ప్రీత్ సింగ్ పడి లేచిన కెరటం లాంటిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ కి జంటగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అన్న సినిమా చేసింది. ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వత తెలుగులో వరసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకుంది. ఎక్కువగా మెగా హీరోలతో నటించి టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్ కి సరైన హిట్స్ దక్కలేదు.

Rakul Preet to prove herself with Nithin to Stay - tollywood

అదే సమయంలో నాగార్జున తో చేసిన మన్మధుడు 2 చేసి ఇంకా దెబ్బ తినింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి అనూహ్యంగా క్రిష్ – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది. ప్రస్తుతం నితిన్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయిందట. అలాగే బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ – ముంబై కి ట్రావెల్ చేస్తోంది. ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది.

Krish Next With Vaishnav Tej And Rakul - Telugu Am Ratnam Ntr Kathanayakudu  Mahanayakud Pawan Kalyan Preet Singh Saibabu Jagarlamudi Rajeev  Reddy-TeluguStop

అనూహ్యంగా కరోనా బారిన పడిన రకుల్ ప్రీత్ సింగ్ వెంటనే ఇంటికెళ్ళి పోయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇమ్యూన్యుటీ పెంచుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు కరోనా వచ్చిందన్న భావన ఎక్కడా లేకుండా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తోందట. పౌష్టిక ఆహారం ఎక్కువ తీసుకోవడం తో పాటు బాగా రెస్ట్ కూడా తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే వ్యాయామం చేయడం మీద కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే బరువు పెరుగుతుందేమో అన్న మాట కూడా వినిపిస్తుందట. రకుల్ మాత్రం ఇవన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి. మొత్తానికి త్వరలో కరోనా నుంచి కోలుకొని మళ్ళి సెట్ లో అడుగుపెడతానని ధీమాగా చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.