రాజకీయాల కోసం అన్నాత్తే ని మొదలు పెట్టిన రజనీకాంత్ ..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే యంగ్ హీరోల కంటే స్పీడ్ గా కమిటయిన సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ వయసులోనూ రజనీ స్టామినా అసాధారణం అని చెప్పాలి. రజనీకాంత్ నుంచి ఇప్పటికే కబాలి, కాలా, పేటా, రోబో 2.ఓ, దర్బార్ సినిమాలు వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రజనీ సినిమాలకి విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం ప్రతేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి దర్బార్ వచ్చిన సంగతి తెలిసిందే.

Darbar Movie Review {3/5}: An engaging commercial cocktail of action and  drama

ఇక ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అన్నాత్తే అన్న సినిమా మొదలు పెట్టాడు. వాస్తవంగా అయితే ఈ సినిమా ఈపాటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా దాదాపు 6 నెలలు ఈ ప్రాజెక్ట్ పెండింగ్ పడింది. ఇక వరసగా ఫ్లాప్స్ వస్తున్న కారణంగా భారీ సక్సస్ అందుకోవాలన్న ఉద్దేశంతో శివ కి గ్రీన్ సిగ్నల్ ఇచాడు రజనీకాంత్. ఇప్పటికే కోలీవుడ్ లో అన్నాత్తే తో రజనీ భారీ హిట్ కొట్టబోతున్నాడని ఫిక్సైయ్యారు. ఇక శివ కోలీవుడ్ లో అజిత్ కి వరసగా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కోలీవుడ్ లో శివ ట్రాక్ రికార్డ్ బావుంది.

దాంతో రజనీ కూడా భారీ మాస్ హిట్ ఆశిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన అన్ని సినిమాలు మళ్ళీ మొదలైనప్పటికి రజనీ అన్నాత్తే మాత్రం మొదలవలేదు. కాగా తాజాగా రజనీకాంత్ రాజకీయాలలో బిజీ కాబోతున్నారు. సొంతగా ప్రార్టీ పెట్టబోతున్నట్టు రాజనీ కాంత్ రీసెంట్ గా వెల్లడించారు. ఈ క్రమంలో అన్నాత్తే సినిమాని వీలైనత త్వరలో కంప్లీట్ చేయాలని రజనీ డిసైడయ్యాడట. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా పూర్తైన ఈ సినిమాలో కీర్తి సురేష్, ఖుష్బూ, నయనతార, మీనా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం అన్నాత్తే సినిమాని రజనీ జనవరి లో సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని మేకర్స్ కి సూచించాడని సమాచారం.