తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో నిలబెట్టాడో చూస్తున్నాము. గత సినిమాలు బాహుబలి తోనే ఖండాంతరాలు దాటించిన రాజమౌళి ఇప్పుడు దాని కన్నా మరిన్ని రెట్లు ఎక్కువ స్థాయిలో ఆదరణ, గుర్తింపుని తన మాసివ్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) తో అయితే సొంతం చేసుకున్నాడు.
ఏకంగా హాలీవుడ్ లో ఈ సినిమా సెన్సేషన్ ని నమోదు చేస్తూ దూసుకెళ్లడం ఆసక్తిగా అయితే మాత్రం రీసెంట్ గానే న్యూయార్క్, అట్లాంటిక్ అవార్డ్స్ లో చాలా కీలక పాత్ర పోషించి ఈ చిత్రం ఆస్కార్ కి బాగా దగ్గరయింది. ఇక లేటెస్ట్ గా అయితే మరో ప్రఖ్యాత ఇంటర్నేషనల్ అవార్డు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులలో పలు కాటగరీస్ లో ఎంపిక అయ్యి మరోసారి వార్తల్లో ఈ చిత్రం అయితే నిలిచింది.
మరి దీనితో ఇప్పుడు ఇండియా అంతా కూడా ఈ చిత్రం కోసం మాట్లాడుతూ ఉండగా ఈ అదరణపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని అయితే పెట్టారు. రెండు కేటగిరీ లలో మా RRR చిత్రాన్ని నామినేట్ చేసినందుకు జ్యూరీ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నా టీం కి కూడా కంగ్రాట్స్ చెప్తున్నానని అలాగే ఇంత ప్రేమ ఆదరణ ఇచ్చిన ఆడియెన్స్ మరియు ఫ్యాన్స్ కి రుణపడి ఉంటానని అయితే రాజమౌళి తెలిపారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Thanks to the jury at @goldenglobes for nominating #RRRMovie in two categories. Congratulations to the entire team…
Thanks to all the fans and audience for your unconditional love and support through out. 🤗🤗🤗
— rajamouli ss (@ssrajamouli) December 12, 2022