వైరల్ : కీరవాణితో తమ అవార్డ్స్ పై రాజమౌళి ఫన్నీ పోస్ట్.!

మన టాలీవుడ్ దిగ్గజ ఫిలిం మేకర్ ఎస్ ఎస్ రాజమౌళి మరియు లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి వర్క్స్ వచ్చాయో మన తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే లేటెస్ట్ గా వారి సెన్సేషనల్ వర్క్ రౌద్రం రణం రుధిరం కి గాను ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ కి కూడా తమ నాటు నాటు వెళ్ళింది.

ఇక ఈ శుభ వార్త ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే మరో గుడ్ న్యూస్ వీరికి పద్మశ్రీ పురస్కారం రూపంలో అయితే వచ్చింది. మరి రాజమౌళి మరియు కీరవాణి లకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేయగా లేటెస్ట్ గా రాజమౌళి పోస్ట్ మంచి ఆసక్తిగా మారింది.

కీరవాణి కాళ్ళ దగ్గర ఓ మెట్టుపై రాజమౌళి కూర్చొని “మీ చాలా మంది అభిమానుల్లానే మీకు రావాల్సిన గుర్తింపు లేట్ గానే వచ్చింది అని అయితే మీరు ఎప్పుడు చెప్తున్నట్టుగా ఈ విశ్వం ఒకరి కష్టానికి ఎప్పుడో ఓ ఆశ్చర్యకర మార్గంలో దాన్ని అందిస్తుంది అని తాను చెప్తూ ఉండేవారని.

ఇప్పుడు అలాగే నేను ఆ యూనివర్స్ కి చెప్తున్నాను కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా ఒకటి ఎంజాయ్ చేసాక కొంచెం గ్యాప్ తర్వాత ఇంకొకటి ఇవ్వు” అంటూ ఓ ఫన్నీ పోస్ట్ ని అయితే తాను చేశారు. దీనితో ఈ క్రేజీ పోస్ట్ అభిమానుల్లో నవ్వు తెప్పించింది. కాగా ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా అందుకున్న సూపర్ సక్సెస్ వారి కష్టానికి సరైన ఫలితాన్ని అందించింది అని చెప్పుకోవాలి.