Prabhas – Rajamouli: ప్రభాస్ రాధే శ్యామ్ కోసం రంగంలోకి దిగిన రాజమౌళి!

Prabhas – Rajamouli: ప్రభాస్ అభిమానులు రాధే శ్యామ్ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ ను మిస్ అవడం లేదు.రాధే శ్యామ్ లో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే తొలిసారి నటించింది . రాధా కృష్ణ కుమార్ ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ, కృష్ణం రాజు, సత్య రాజ్,సచిన్ ఖేడెకర్, ప్రియా దర్శి, మురళి కృష్ణ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, మరియు జయరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.UV క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాధా కృష్ణ కుమార్ ఈ సినిమా ప్రచారం కోసం హిందీ ట్రైలర్ కు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ను అమితాబ్ బచ్చన్ చేత ఇప్పించారు. ఇక ఇపుడు కొత్త ట్రైలర్ కోసం బాహుబలి డైరెక్టర్ రాజమౌళితో వాయిస్ ఓవర్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ప్రభాస్, రాజమౌళి అత్యంత సన్నిహితంగా ఉండటంతో ప్రభాస్ తానే స్వయంగా రాజమౌళి ని ఈ సహాయం అడిగారని టాక్. దీనికి రాజమౌళి అంగీకరించారని తెలుస్తోంది.

ఇక రాధే శ్యామ్ సినిమా ను మార్చి 11 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడింది ఈ క్రమంలోనే ఈ సినిమాని మార్చి 11వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు. బాహుబలి సినిమా తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా విడుదలవుతున్న ప్రభాస్ రాధేశ్యామ్ ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.