78 ఏళ్ళ వ‌య‌స్సులో హీరోగా.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ఫ్యాన్స్

ఏ వ‌య‌స్సులో చేయాల్సింది ఆ వ‌య‌స్సులో చేస్తేనే అందంగా ఉంటుంది. యుక్త వ‌య‌స్సులో చేయాల్సింది ముస‌లోళ్ళు అయ్యాక చేసిన‌, ముస‌లోళ్ళు అయ్యాక చేయాల్సింది యుక్త వ‌య‌స్సులో చేసినా చాలా చెండాలంగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటిదే ఒకటి జ‌ర‌గనున్న‌ట్టు అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లు ఆ నోట ఈ నోట ప‌డి అభిమానుల చెంత‌కు చేరే సరికి ఇలా ఎందుకు చేస్తున్నారురా అంటూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్ర రావు ద‌ర్శ‌కుడిగా చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. ప్రేమ‌, భ‌క్తి, యాక్ష‌న్ ఇలా ఒక‌టేంటి దాదాపు అన్ని ర‌కాల జాన‌ర్స్‌ని ట‌చ్ చేస్తూ సినిమాలు చేశారు. 70వ ద‌శ‌కంలో శోభ‌న్‌బాబు హీరోగా న‌టించిన `బాబు` చిత్రంతో రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. చివ‌రిగా ఇంటింటా అన్న‌మయ్య అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో పెళ్ళి సంద‌డి అనే చిత్రంతో తిరిగి ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు. పెళ్ళి సంద‌డి అనే టైటిల్‌తో గ‌తంలో ఓ చిత్రాన్ని తెర‌కెక్కించిన రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు సేమ్ టైటిల్‌తో మ‌ళ్ళీ సినిమా చేస్తున్నారు.

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే మొన్న‌టి వ‌ర‌కు బ‌హిరంగ వేడుక‌ల‌లో మాట్లాడ‌డానికే పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ని రాఘ‌వేంద్ర‌ర‌రావు ఇప్పుడు ఏకంగా హీరో అయిపోదామ‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఓ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఆయ‌న క్లీన్ బౌల్డ్ కావ‌డంతో హీరోగా చేసేందుకు సై అంటున్నార‌ట‌. 78 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న ఈ ద‌ర్శ‌కుడి స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. ఆ ముగ్గురు హీరోయిన్స్ పాపుల‌ర్ హీరోయిన్స్ అని టాక్. ద‌ర్శ‌కుడిగా 45 ఏళ్ల సుధీర్గ ప్ర‌స్థానంలో రాఘ‌వేంద్ర‌రావు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీలోనూ క‌నిపించ‌లేదు. కాని ఇప్పుడు హీరోగా న‌టిస్తున్నాడు అనే సరికి అంద‌రు షాక్ అవుతున్నారు