అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ గారు, మొదలైన వారు హాజరయ్యారు.
వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు కూడా లెజెండ్రీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు. అంతేకాకుండా మంచు మూడో తరం అవ్రామ్, తన తాత (డా. మోహన్ బాబు మంచు) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వీరితో పాటు కోట శ్రీనివాస్ స్మారక అవార్డు బాబు మోహన్ గారు అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర్ బట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ గారి కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
నటుడు అజయ్ ఘోష్, నటి శరణ్య ప్రదీప్, సింగర్ కీర్తన శర్మ, డాన్స్ మాస్టర్ విజయ్ పొలంకి, హీరో చంద్ర హాస్, సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి, డైరెక్టర్ యాదు వంశీ, మధుప్రియా, హీరో శివాజీ, డైలాగ్ రైటర్ ఆకెల్ల శివప్రసాద్, 7 హిల్స్ ప్రొడ్యూసర్ సతీష్, రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళీ గింజుపల్లి మొదలైన వారు బాబు మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.
అంతేకాకుండా ఓటిటి విభాగంలో సిరీస్ నైన్టీస్ (ETV Win), హాసన్ (నైన్టీస్), రోహన్ రాయ్ (నైన్టీస్), నటి జోర్దార్ సుజాత వంటి వారు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.





