నయన్, విగ్నేష్ ఇంటికి వెళ్లిన రాధిక శరత్ కుమార్.. అందుకోసమేనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ కపుల్ నయనతార, విగ్నేశ్‌ ​శివన్‌ ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ సినిమాకు విగ్నేశివంతశకత్వం వహించారు. అప్పుడు విగ్నేశ్‌ ​శివన్‌, నయనతారల మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. 2016 నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట ఇటీవల మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇది ఇలా ఉంటే నయనతార,విగ్నేశ్‌ ​శివన్‌ దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం మనందరికీ తెలిసిందే.

ఈ విషయం మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సరోగసి విషయం ప్రభుత్వం వరకు వెళ్ళింది. అంతేకాకుండా విగ్నేశ్‌ ​శివన్‌ దంపతులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సమన్లు జారీ చేయడం ఆ తర్వాత వారు అధికారులకు వివరణ ఇవ్వడం విచారణ జరగడం ఇవన్నీ కూడా అయిపోయాయి. అయితే ఈ వివాదం ముగిసే వరకు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందా అని నెటిజన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అని ఎట్టకేలకు ఈ వివాదం సామరస్యంగా పూర్తి అవ్వడంతో అందరూ మౌనంగా ఉండిపోయారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒకప్పటి సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ విగ్నేష్ శివన్ దంపతుల ఇంటికి వెళ్ళింది. స్థానిక ఎగ్మోర్‌లో నయనతార ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలను చూసి నయనతార విఘ్నేష్‌ శివన్‌ లకు శుభాకాంక్షలు కూడా తెలిపింది రాధిక శరత్ కుమార్. ఈ నేపథ్యంలోనే నయనతార దంపతులతో కలిసి దిగిన ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.