Radhe Shyam: ప్రేక్షకులపై అసహనం వ్యక్తం చేసిన రాధేశ్యామ్ డైరెక్టర్!

Radhe Shyam: ఇటీవలే డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన సినిమా ‘రాధేశ్యామ్’. ఇందులో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా మొత్తం ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కింది.

దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇందులో ఎటువంటి యాక్షన్ సీన్లు లేవని విమర్శలు చేశారు. దాంతో తాజాగా డైరెక్టర్ ఈ విషయంపై ఫైర్ అయ్యాడు. వెజిటేరియన్ హోటల్ కి వెళ్లి చికెన్ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు అంటూ.. ఈ సినిమా లవ్ స్టోరీ అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాము అంటూ అసహనం వ్యక్తం చేశాడు.