Prabhas- Radheshyam: రాధే శ్యామ్ ఓటీటీ కోసం అమెజాన్ ఫ్యాన్సీ ఆఫర్… ఎన్ని కోట్లో తెలుసా?

Prabhas- Radheshyam: రాధే శ్యామ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 11 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు.

ఈ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. క్లాసిక్ ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కింది.ప్రేమకు విధి రాతకు మధ్య జరిగే సంఘర్షణ గా ట్రైలర్ లో పలికిన సంభాషణ అందరిని ఆకట్టుకుంది మరియు ఆసక్తి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ శ్రమిస్తోంది. ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రభాస్ ఇంతకుముందు సినిమాలకంటే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న చిత్రం. ఇక ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు భారీగా పెట్టుకున్నారు.

ఇక ఓటీటీ రిలీజ్ గురించి ఒక విషయం ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. అమెజాన్ సంస్థ రాధే శ్యామ్ ఓటీటీ హక్కులను చాలా పెద్ద మొత్తంతో దక్కించుకుంది.ఇంత వరకు ఏ సినిమాకు ఇవ్వని ధరను ఈ సినిమాకు ఇచ్చింది అమెజాన్. 150కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత వరకు ఏ భారతీయ సినిమా కు ఇంత ఎక్కువగా మొత్తం కు అమెజాన్ సినిమా ను కొనుగోలు చేయలేదు. ఇక సినిమా నిడివి 2గంటల 18నిమిషాల గా లాక్ చేసారు. సెన్సర్ కార్యక్రమం పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది రాధే శ్యామ్.