హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న కమెడియన్ కూతురు..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీల పిల్లలు, లేదా కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకులుగా, హీరో హీరోయిన్ లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక కమెడియన్స్ ఫ్యామిలీకి చెందిన వారసులు కూడా సినిమా ప్రపంచంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కమెడియన్ల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ కమెడియన్ పృథ్వీరాజ్ కూతురు కూడా త్వరలోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.అయితే గతంలోని పృథ్వీరాజ్ తన పిల్లల సినిమా ఎంట్రీ విషయం గురించి ముందుగానే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన కూతురు నటిగా ప్రత్యేకంగా గుర్తింపును అందుకోవాలని అనుకుంటుంది అని ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది అని తెలిపాడు. కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాతో పృథ్వీరాజ్ కూతురు శ్రీలు హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం కాబోతోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ పూర్తి అయ్యాయి.

త్వరలోనే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ఒక వీడియోను విడుదల చేస్తూ అందులో నన్ను ఆదరించినట్లుగానే నా కూతురికి కూడా సపోర్ట్ చేయండి అని తెలిపారు. అలాగే ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును లభిస్తుంది. నటనలో అలాగే డ్యాన్స్ లో కూడా తన కూతురు శిక్షణ తీసుకుంది అని చెప్పుకొచ్చారు పృథ్వీ రాజ్. అంతే కాకుండా ఈ సినిమాతోనే పృథ్వీరాజ్ స్నేహితుడు కుమారుడు క్రాంతి కూడా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ విషయంలో మరింత డోస్ పెంచాలని కూడా పృథ్వీరాజ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.