“వీరమల్లు”, “ఉస్తాద్ భగత్ సింగ్” పై ఓ క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తుండగా ఆల్రెడీ తాను గెస్ట్ రోల్ లో చేసిన చిత్రం “బ్రో” రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. ఇక ఈ చిత్రం తర్వాత మరిన్ని చిత్రాలు పవన్ లైన్ లో ఉండగా వాటిలో అయితే సస్పెన్స్ గా ఉండిపోయిన చిత్రాలు మాత్రం పవన్ మొదట స్టార్ట్ చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కాగా దీని తర్వాత స్టార్ట్ చేసి వదిలేసిన చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రం అని చెప్పాలి.

కాగా వీరమల్లు చిత్రాన్ని అయితే దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా ఉస్తాద్ ని హరీష్ శంకర్ చేస్తున్నాడు. అయితే మొదటగా హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఈ చిత్రం ఎప్పుడు మొదలు అవుతుందో క్లారిటి అయితే లేదు. మరి ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ ఈ చిత్రం ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేస్తామని అలాగే ఇయర్ ఎండింగ్ కి షూటింగ్ ని ముగిస్తామని తెలిపారు.

అంతే కాకుండా వచ్చే ఏడాది ఎన్నికల లోపు అయితే రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని ఓ క్లారిటీ ఇవ్వగా ఇక ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు మాట్లాడుతూ తమ చిత్రం ఆగిపోలేదు అని మొదట క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని అయితే సాధ్యమైనంతలో సంక్రాంతి బరిలో దింపుతామని కన్ఫర్మ్ చేయగా ఒకవేళ అప్పుడు అవ్వకపోతే సమ్మర్ రేస్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే పెద్ద సస్పెన్స్ గా ఉన్న ఈ సినిమాలపై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.