జయశంకర్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న నిర్మాత శేషు మారంరెడ్డి!

ప్రస్తుతం నిర్మాత శేషు మారం రెడ్డి.. డైరెక్టర్ జయ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు నిర్మాత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు గతంలో ‘గ్రహమ్’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటిస్తుంది. అంతేకాకుండా సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, వైవా హర్ష, అక్ష పార్ధసాని తదితరులు నటిస్తున్నారు.

నిర్మాత శేషు మారం రెడ్డితో పాటు ఆర్ వి రెడ్డి కూడా ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత శేషు మారంరెడ్డి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగును ఏప్రిల్ లో పూర్తిచేస్తామని తెలిపాడు.

ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర కామెడీ సీన్స్ మాత్రం హైలెట్గా ఉంటాయని అన్నాడు. డైరెక్టర్ జయశంకర్ వర్కింగ్ స్టైల్ బాగుందని.. చాలా అద్భుతంగా రూపొందిస్తున్నాడు అని తెలిపాడు. దీంతో ఆయనతో మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాము అని అన్నాడు. ఇక డైరెక్టర్ కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు. నిర్మాతల ప్రోత్సాహంతో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని అన్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నాడు.