భ‌ర్త‌తో ప్రియాంక చోప్రా గొడ‌వ‌.. కారులో నుండి దించేసి వెళ్లిపోయిన బాలీవుడ్ భామ‌

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌లు ఒక‌రు . వీరిద్ద‌రి పెయిర్ చూడ‌ముచ్చ‌టగా ఉంటుంది. త‌న‌క‌న్నా ప‌దేళ్ళు చిన్న వాడైన నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా అత‌నితో ఎంతో సంతోషంగా ఉంటుంది. అడ‌పాద‌డ‌పా ఇద్ద‌రి రొమాంటిక్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్ కు థ్రిల్ కూడా క‌లిగిస్తుంటుంది. లాక్ డౌన్ స‌మ‌యంలో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఇంటికే ప‌రిమితం కాగా, ఆ స‌మ‌యంలో ఏమేం చేశార‌నే విష‌యాల‌ని మాత్రం సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ల వివాహం 2018లో జ‌ర‌గ‌గా, పెళ్ళై రెండేళ్లు అయిన వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ అలానే ఉంది. చాలా ఆప్యాయంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌ర‌గ‌గా, ప్రియాంక త‌న భ‌ర్త‌ని కారులో నుండి దించేసి సీరియ‌స్‌గా వెళ్లిపోయింది. ఇది విన్న ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ రియ‌ల్ లైఫ్‌లో కాదులేండి, రీల్ లైఫ్‌లో. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా టెక్ట్స్ ఫ‌ర్ యూ అనే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఇందులో నిక్ అతిథి పాత్ర పోషిస్తున్నారు.

రీసెంట్‌గా ఇద్దరికి సంబంధించి కొన్ని స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించారు. ఇందులో భాగంగానే కారులో ప్ర‌యాణిస్తున్న నిక్‌తో గొడ‌వ‌ప‌డ‌డం, అనంత‌రం భ‌ర్త‌ని దింపేసి వెళ్ళిపోవ‌డం జ‌రిగింది. ఇక బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం ‘వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌, ‘ది మాట్రిక్స్ 4’, బాలీవుడ్‌ హీరో రాజ్‌ కుమార్‌ రావ్‌తో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ అనే చిత్రాల‌తో బిజీగా ఉంది. జ‌ర్మ‌నీలో రిలీజైన ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ చిత్రాన్ని హాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్నారు.