Ram Charan: లండన్ లో చరణ్ కు ఘన స్వాగతం….మేడమ్ టుస్సాడ్స్ కు చేసుకున్న మెగా ఫ్యామిలీ!

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన పలువురు హీరోల మైనపు విగ్రహాలను ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు రాంచరణ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నారు. నేడు సాయంత్రం చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో చరణ్ దంపతులతో పాటు చిరు దంపతులు కూడా వెళ్లారు.మేడం టుస్సాడ్స్ లో నేడు స్టాచ్యూ లాంచ్ ఘనంగా జరగబోతోంది. దీనికోసమే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు.

ఇలా మెగా ఫ్యామిలీ లండన్ చేరుకోవడంతో అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది.పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్ న్యూ లుక్ అందరిని ఆకట్టుకుంది.మేడం టుస్సాడ్స్ స్టాచ్యూ లాంచ్ కావడం అరుదైన గౌరవం అని చెప్పాలి. రామ్ చరణ్ తో పాటు తన పెట్ రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో ఆవిష్కరించి అనంతరం సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. ఇక రాంచరణ్ సినిమాలో విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు పలు పాన్ ఇండియా సినిమాలకు చరణ్ కమిట్ అయ్యారు.