Dhee 14: ఢీ వేదికపై గిఫ్ట్ చూసి బోరున ఏడ్చిన ప్రియమణి.. అందులో ఏముందో తెలుసా?

Dhee 14: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీడాన్స్ గురించి అందరికీ తెలిసిందే బుధవారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రియమని ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.తన లవ్ స్టోరీని వేదికపై ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు పర్ఫార్మ్ చేయడంతో ఈమె ఎమోషనల్ అయ్యారు. ఈ విధంగా తన లవ్ స్టోరీని తలుచుకొని ఏడ్చిన ప్రియమణికి ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చారు.

ఇలా వేదికపై ప్రియమణికి కొరియోగ్రాఫర్ సాయి ఒక గిఫ్ట్ అందజేశారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన ప్రియమణి ఒక్కసారిగా బోరున ఏడ్చారు. మరి ఆ గిఫ్ట్ లో ఏముంది అనే విషయానికి వస్తే… ప్రియమణి తన అమ్మమ్మ తో కలిసి ఉన్న ఒక పెయింటింగ్ చూసి ఒక్కసారిగా ఆనందంతో పాటు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ప్రియమణి తన అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని ఇదివరకే ఎన్నో సార్లు తన అమ్మమ్మ గురించి వెల్లడించారు.

నిజం చెప్పాలంటే ప్రస్తుతం ప్రియమణి ఇండస్ట్రీలో ఇలా ఉన్నారు అంటే దానికి కారణం తన అమ్మమ్మ.అమ్మమ్మ సహకారం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదు అంటూ తన అమ్మమ్మ గురించి చెబుతూ ప్రియమని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే గత వారం కూడా నందిత శ్వేత పుట్టినరోజు కావడంతో యాంకర్ ప్రదీప్ తనకెంతో ఇష్టమైన కుక్క పిల్ల బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చారు.అది చూసిన నందిత శ్వేత కూడా ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.