టాలీవుడ్ లోనే ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సినిమాలు .. ఒకటి సలార్ .. ఇంకొకటి ..?

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ ని కంప్లీట్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆదిపురుష్, తో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించబోతున్న నాగ్ అశ్విన్ సినిమాలను చేయబోతున్నాడు. కాగా ఈ రెండు సినిమాలకంటే ముందు సలార్ మొదలు పెట్టబోతున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న ” సలార్ ” జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. ఆ సినిమా తో పాటే ఆదిపురుష్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

What Is Meant by Salaar?

సలార్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నాడు ప్రశాంత్ నీల్. కాగా ఈ సినిమా కి కెజీఎఫ్ నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు. ప్రభాస్ మూడు సినిమాలు 2021 లో షూటింగ్ జరపబోతున్నారు. వాటిలో ఆదిపురుష్ తో పాటు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ ని 2022 లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీ ఎన్.టి.ఆర్ తో భారీ యాక్షన్ సినిమాని తెరకెక్కించబోతున్నాడని తాజా సమాచారం.

Rajamouli picks Mahesh & Prashant Neel picks NTR

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిరించబోతున్నారని సమాచారం. ముందు నుంచి కూడా ప్రశాంత్ నీల్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమాని మైత్రీ మూవీస్ వారే నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బ్యానర్ తో హోంబలే ఫిల్మ్స్ కూడా కలబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించేదుకే ప్రశాంత్ నీల్ యూనివర్సల్ కథ సిద్దం చేశాడట. ఇప్పటికే ఆ కథ ఎన్.టి.ఆర్ కి కూడా చెప్పినట్టు ఎన్.టి.ఆర్ కి ఈ కథ విపరీతంగా నచ్చినట్టు సమాచారం.