తన భర్తతో సహా ఏడ్చేసిన ప్రణీత.. ఎందుకంటే?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే. ఏం పిల్లో.. ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. గతంలో ఓ బడా బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకొని పెళ్లి జీవితంలో అడుగుపెట్టింది.

ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో సహా బాగా ఎమోషనల్ అయ్యింది. ఇటీవలే తన భర్తతో కలిసి తాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను చూశానని తన ఇన్ స్టా వేదికగా తెలిపింది. ఇక ఈ సినిమా చూసిన తర్వాత తన భర్తతో సహా తను కూడా బాగా ఏడ్చానని.. సుమారు 30 సంవత్సరాల క్రితం కశ్మీర్ పండిట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో కళ్ళకు కట్టినట్టు చూపించారని తెలిపింది.