Prabhas Thanks : ‘రాధే శ్యామ్’కు గాత్రాన్ని అందించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రభాస్

RadheShyam

Prabhas Thanks: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌, మేకింగ్ వీడియోకు అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నట్టు తెలిస్తోంది.

ఫ్యాన్స్‌కు ఈ మూవీని మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను గట్టి స్పీడ్‌తో కొనసాగిస్తోంది. అందులో భాగంగా ప్రభాస్, పూజా హెగ్దేలు కూడా వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ బిజీ షెడ్యూల్‌లో గడుపుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ మరొక్క రోజు ఆగాల్సిందేనంటున్నారు సినీ వర్గాలు.

ఇదిలా ఉండగా రాధేశ్యామ్ సినిమాకు తెలుగులో రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వగా, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్, హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందించారు. అయితే వీరికి గతంలోనే మూవీ మేకర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన ధోరణిలో వీరికి స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ సర్, శివ రాజ్‌కుమార్ సర్, పృథ్వీరాజ్ సర్, సుకుమారన్ సర్, ఎస్‌ఎస్ రాజమౌళి సర్ తమ అద్భుతమైన గాత్రాన్ని రాధేశ్యామ్‌కి అందించారని ఆయన పేర్కొన్నారు. నిజంగా వీరంతా తమ వాయిస్‌ను అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ మూవీని మాతో పాటు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా అందించినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఓ పోస్ట్ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.