Prabhas – Radhe Shyam: రిపోర్టర్ ప్రశ్నకు ప్రభాస్ పంచ్… రూ.50 అయినా సినిమా చూడండి.. ఎందుకీ ప్రశ్నలు…!

Prabhas – Radhe Shyam: దాదాపుగా మూడేళ్ల నుంచీ ఊరిస్తే ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా రాధే శ్యామ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్దే జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న అభిమానులను అలరించేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, పాటలు రిలీజ్ అవడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంత చేసుకుంది రాధే శ్యామ్. ఎప్పుడో జనవరిలోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా మరియు తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

ఇక సినిమా విడుదలకు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్దే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కోసం ఇటీవలే చెన్నైకి వెళ్లి అంతే స్థాయిలో ప్రచారం ఆరంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు అన్ని చోట్లా భారీ స్థాయిలోనే ప్రమోషన్స్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రభాస్ చెప్పిన సమాధానాలు ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారాయి. అయితే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఫన్నీ వేలో ఆన్సర్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. క్లైమాక్స్‌లో లవ్ గెలుస్తుందా లేదంటే డెస్టినీ గెలుస్తుందా అన్న రిపోర్టర్ ప్రశ్నకు నేను ఎలా చెప్తాను సర్, కనీసం 50రూపాయల టికెట్‌ అన్నా కొని సినిమా చూడండి అంటూ సరదాగా సమాధానం చెప్పారు ప్రభాస్. ఇకపోతే ఈ సినిమా నిర్మాణ బడ్జెట్ రూ.300కోట్లు అన్న ఆయన, మీకు క్లైమాక్స్‌ చెప్పేస్తే నన్ను చంపేస్తారు అంటూ ప్రభాస్ నవ్వుతూ అంటూ అందరినీ నవ్వించారు.