ఆదిపురుష్ ఆరంభ్ .. మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్ !

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతం కంటే ఇప్పుడు మరింత స్పీడు పెంచారు. 2021 ఆరంభం నుంచే తన దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే కమిటైన సినిమాలు ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు ప్రభాస్. ఇప్పటికే సలార్ సెట్స్ మీదకొచ్చేసిన యంగ్ రెబల్ స్టార్.. తాజాగా ఆయన నటించబోతున్న మరో బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ ప్రారంభించేశారు.

ఈ మేరకు ఆదిపురుష్ ఆరంభ్ అంటూ తన అభిమానులకు ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనుంది ఆదిపురుష్ మూవీ. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ ఆదిపురుష్ రూపంలో చూపించనున్నారట. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండటం ఆయన అభిమానుల్లో సరికొత్త ఆతృతను నింపేసింది

సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోందని , త‌ల్లి పాత్ర‌లో హేమ‌మాలిని న‌టిస్తోంద‌ని, ల‌క్ష్మ‌ణుడిగా టైగ‌ర్ ష్రాఫ్‌ని ఎంపిక చేసార‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియాల్సి ఉంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 11, 2022న విడుద‌ల చేయ‌నున్నారు. భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.