Prabhas: మరో సారి ప్రభాస్ – అనుష్క కాంబో… రీ ఎంట్రీతో అనుష్క హిట్ కొట్టేనా ?

Prabhas: టాలీవుడ్‌లో కొందరు నటీనటుల కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు క్రేజ్ ఎక్కువ. ఆ జోడీలను ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంటుంది. అందుకే వాళ్ల కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి జోడీల్లో ఒకరు ప్రభాస్- అనుష్క. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు మిర్చి, బాహుబలి లాంటి చిత్రాల్లో నటించి, ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య చనువు చూసి, వీరు ప్రేమలో ఉన్నారు, త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతుంది అంటూ ఏవేవో కథలు కూడా అల్లారు. ఇక టాలీవుడ్‌లో కొన్ని పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఉంటాయి. వాటిల్లో ప్రభాస్- అనుష్క అని భావించేవారు కోకొల్లలు. అయితే నిజంగానే రియల్ లైఫ్ కపుల్స్ అయితే బాగుండు అని ప్రేక్షకులు ఇప్పటికీ భావిస్తున్నారు.

అయితే వీళ్లు మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక తీపి వార్త అందినట్టు తెలిస్తోంది. వీరిద్దరూ కలిసి మరోసారి హీరో, హీరోయిన్లుగా నటించననున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క, ప్రస్తుతం ప్రభాస్‌తో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం అయితే ఆ క్రేజ్‌ను క్యాచ్ చేస్తూ ప్రభాస్- అనుష్క జోడీని మళ్లీ వెండితెరపై చూపే ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్ ఎవరో తెలుసా ? ఆయనే మారుతి.

ఇక ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇటీవల ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ హీరోయిన్‌గా అనుష్కను అనుకున్నట్టు తెలుస్తోంది. కాగా కృతిశెట్టి, మాళవిక కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నారని టాక్. ఇక ఈ విషయంపై అధికారికంగా వెలువడాల్సిన ప్రకటన కోసం ప్రభాస్ – అనుష్క ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే గనక నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే.