Pooja Hegde: పూజా హెగ్డే కు ఆ ముగ్గురితో నటించాలని ఉందట.. ఆహీరోలు ఎవరో తెలుసా?

Pooja Hegde: టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగుతోంది పూజా హెగ్డే. సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కథానాయిక ఇప్పుడు పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా హెగ్డే , ప్రభాస్ తో చేసిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా తమిళ్ విజయ్ తో తీసిన బీస్ట్, మెగా స్టార్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఆచార్య కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ప్రస్తుతం అయితే పూజా హెగ్డే రాధేశ్యామ్ ప్రమోషన్లు చాలా బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను ఇలా చెప్పుకొచ్చింది.తనకు కమల్‌హసన్‌, ధనుష్‌, రణ్‌బీర్ కపూర్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో కలిసి నటించాలనుంది అంటూ తన మనసులో మాటను బయపెట్టింది.
తెలుగు తమిళ్ లోనే కాకుండా హిందీ లో సర్కస్ అనే సినిమా, తెలుగులో త్రివిక్రమ్- మహేష్ చిత్రంలో కూడా పూజా హెగ్డే నటించనుంది.

పూజా హెగ్డే మనసులోని మాటలు ఎప్పుడు నిజం అవుతాయో వేచి చూడాలి.ఈమె స్పీడు చూస్తుంటే పూజ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతోందనీ తెలుస్తుంది.ఇప్పటికే ఈమె తమిళంలో విజయ్ సరసన బీస్ట్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే ఇక తమిళంలో కూడా వరుస అవకాశాలు వస్తాయనీ చాలా నటించాలని హీరోలతో నటించే అవకాశం త్వరలోనే వస్తుందని చెప్పవచ్చు.