ఆ స్వేచ్ఛ ఎక్కడా దొరకదంటున్న పూజా హెగ్డే.. నటి కామెంట్స్ వైరల్?

పూజా హెగ్డే ఈ ఏడాది ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్, బీస్ట్,ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశకు గురి చేశాయి. ఇలా వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో పూజా హెగ్డే సినీ కెరియర్ ముగిసిపోతుందని అందరూ భావించారు. అయితే పూజా హెగ్డే మాత్రం రెట్టింపు వేగంతో ఈమె వరస సినిమా అవకాశాలను అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె మూడు నాలుగు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ సినిమా షూటింగ్లలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరయ్యి తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… సెలబ్రిటీలకు పెద్దగా ఎక్కడ స్వేచ్ఛ ఉండదని తెలిపారు.సెలబ్రిటీలు కేవలం ఇంట్లో మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరని ఇంటి నుంచి కాలు బయటకు పెట్టినప్పటి నుంచి వారు నటించాల్సి ఉంటుందని ఈమె తెలియజేశారు.

ఒక్కసారి ఇంట్లో నుంచి అడుగు బయటకు పెడతానే ప్రేక్షకులు అభిమానులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. సెలబ్రిటీల అన్న తర్వాత వారికి ఇలాంటివన్నీ సర్వసాధారణం అయితే తనకు మాత్రం తన ఇంట్లోనే చాలా స్వేచ్ఛగా ఉంటుందని అక్కడ మాత్రమే తనలా బ్రతుకుతానని ఈమె తెలియజేశారు. ఒక్కసారి బయట నుంచి ఇంటికి వస్తున్నప్పుడు తన వృత్తిపరమైన విషయాలన్నింటిని బయటనే వదిలేసి ఇంట్లో తనకు నచ్చిన విధంగా ఎంతో స్వేచ్ఛగా గడుపుతానని తన ఇంట్లో తప్ప తనకు మరేక్కడ ఆ స్వేచ్ఛ దొరకదు అంటూ ఈ సందర్భంగా పూజ హెగ్డే చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.