దీవాళి స్పెష‌ల్‌.. ఫ్యామిలీతో ఫొటోకు ఫోజిచ్చిన పూజా హెగ్డే

చీక‌టి బతుకుల్లో వెలుగులు విరజిమ్మే దీపావ‌ళి పండుగ‌ని చిన్న పెద్దా తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. సెల‌బ్రిటీలు కూడా ఆరుబ‌య‌ట దీపాలు వెలిగించి ఫ్యామిలీతో క్రాక‌ర్స్ కాల్చారు. అందుకు సంబంధించిన ఫొటోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న భార్య‌, కూతురు. అల్లుడుతో క‌లిసి స‌ర‌దాగా దీపావ‌ళి వేడుక జ‌రుపుకున్నారు. అలానే టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే కూడా దీపావ‌ళి పండుగ‌ను సంతోషంగా జ‌రుపుకుంది.

ముకుంద సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా మారింది. ఈ ఏడాది అల వైకుంఠ‌పురంలో చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన పూజా హెగ్డే త్వ‌ర‌లో రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే చిత్రాల‌తో అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈ రెండు చిత్రాల‌లో పూజా హెగ్డే లుక్ ఎలా ఉంటుందో ఇప్ప‌టికే మేక‌ర్స్ రివీల్ చేశారు. త‌మ అభిమాన హీరోయిన్‌ని చూసి ఫిదా అయ్యారు.

దీపావ‌ళి సంద‌ర్భంగా పూజా హెగ్డే త‌న ఫ్యామిలీతో క‌లిసి ఫొటోకి ఫోజులిచ్చింది. ఇందులో అంద‌రు గ్రీన్ క‌లర్ డ్రెస్‌లో మెరిసారు. పూజా క్యూట్ స్మైల్‌తో అభిమానుల మ‌న‌సుల‌ని దోచుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే.. ద‌క్షిణాది ప్రేక్షకులు కథానాయికల నాభి సౌందర్యానికి దాసోహమవుతారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసిన‌ట్టు ఇటీవ‌ల జోరుగా ప్ర‌చారం చేశారు. దీనిపై స్పందించిన పూజా ..నేను చెప్పిన మాటల్ని వేరే రకంగా అన్వయించారు. అక్షరాన్ని మార్చగలరేమో కాని అభిమానాన్ని మార్చలేరు అంటూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది