Prabhas -Pooja Hedge: ఆ విషయంలో ప్రభాస్ కి సారీ చెప్పిన పూజాహెగ్డే… ఇద్దరి మధ్య కుదిరిన రాజీ!

Prabhas -Pooja Hedge: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా ఈ నెల 11 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజ హెగ్డే ప్రవర్తన నచ్చక పూజా హెగ్డే ప్రభాస్ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవటం వల్ల వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలకు పూజా హెగ్డే ప్రభాస్ కి సారీ చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా పూజా హెగ్డే ప్రభాస్ కి సారీ చెప్పడంతో ఇరువురి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని,వీరిద్దరూ కలిసి సంతోషంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి పోయి వీరిద్దరూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికం నిపుణుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.