Pavan kalyan: సాయి ధరమ్ అయ్యాక వైష్ణవ్ తేజ్ అంటున్న.. మెగా మామ..!

 

Pavan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస సినిమాలను షురూ చేసారు. అజ్ఞాతవాసి వాసి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళీ వకీల్ సాబ్ సినిమా ద్వారా మళ్ళీ హిట్ కొట్టిన పవన్ వెంటనే భీమ్లా నాయక్ తో అభిమానులకు పండగ చేసారు. రీమేక్ సినిమాలను ఎక్కువగా తీస్తున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే బాటలో ఇంకో రీమేక్ సినిమాను ఓకే చేసారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్.

హరిహర వీరమల్లు సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాను పూర్తి చేయాల్సి ఉన్నింది. కాని దీని కంటే ముందు వినోదయ సిత్తం’ రీమేక్ మెదలుకానున్నట్లు  సమాచారం. చిత్ర బృందం దీని గురించి అధికారిక ప్రకటన చేయకపోయినా ఈ సినిమా గురించి వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.వినోదయ సీతమ్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించనున్నారట.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ZEE5తో కలిసి ఈ సినిమాని నిర్మించనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 24న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ .. సుధీర్ వర్మతో కూడా ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కథానాయకడిగా నటించనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌ సహ నిర్మాత. దీనిపై త్వరలోనే క్లారిటీ రావలసి ఉంది. ఇలా వరుసగా అల్లుళ్ళ తో సినిమా తీసే పనిలో ఉన్నారట పవన్ కళ్యాణ్.