భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చుట్టుముట్టిన ఈ సందర్భంలో బాలీవుడ్లో ఒక సినిమా టాపిక్ హాట్గా మారింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ మూవీని నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, దర్శకత్వం ఉత్తమ్ నితిన్ భుజాలపై ఉంది. ఇప్పటికే జీ స్టూడియోస్, టీ-సిరీస్ వంటి పెద్ద బ్యానర్లు టైటిల్ కోసం పోటీ పడినా చివరికి ఈ సంస్థకే అవకాశం దక్కింది.
విడుదల చేసిన పోస్టర్లో సైనిక యూనిఫాం వేసుకున్న మహిళా క్యారెక్టర్ ఆకట్టుకుంటోంది. నుదుటి సింధూరం, చేతిలో రైఫిల్, వెనుక యుద్ధభూమి వాతావరణం, ఫైటర్ జెట్లు.. కలిపి ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఇచ్చాయి. సినిమాకి సంబంధించిన పూర్తి కథ, నటీనటుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని బృందం చెప్పింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలను మిళితం చేస్తూ ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణం మధ్య ఈ సినిమా ప్రకటన రావడంతో దీనిపై నెటిజన్ల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. ఒకవైపు కొంతమంది “ఇప్పుడు దేశం మొత్తం ఒకటిగా ఉండాల్సిన వేళ, ఇలా సినిమాల ప్రకటనలేం?” అని ప్రశ్నిస్తే, మరికొంతమంది “సైన్యం స్ఫూర్తిని చూపించే సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాం” అంటున్నారు. మొత్తానికి ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.