ఎన్టీఆర్ సినిమాకి రికార్డ్స్ పిచ్చిలో ఖర్చులైనా వెనక్కి వస్తాయా?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ రీ రిలీజ్ ఏమన్నా ఉంది అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా భూమిక హీరోయిన్ గా నటించిన సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా “సింహాద్రి” రీ రిలీజ్ కూడా ఒకటి. అయితే దీనికి ముందు వచ్చిన చాలా రీ రిలీస్ లు ఒకెత్తు అయితే ఈ ఒక్క సినిమా రీ రిలీజ్ ఒకెత్తు అని చెప్పాలి.

ఈ సినిమాని గత సినిమాల రీ రిలీజ్ రికార్డులు బద్దలు కొట్టి అవన్నీ ఎన్టీఆర్ పేరు మీదే ఉండాలి అన్నట్టుగా ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యిపోయి భారీ ప్లానింగ్ లు చేస్తున్నారు. దీనితో ఈ ఖర్చులకే కొన్ని వారాల కితం కోటి రూపాయలకి పైగానే అయ్యిందని కొన్ని రూమర్స్ ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఏకంగా రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. దీని బట్టి అసలు ఈ సినిమా రీ రిలీజ్ కి ఎలాంటి ప్లానింగ్ లు చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి. కాగా సినిమాకి వచ్చే వసూళ్లు ఏమో కానీ ఈ ఖర్చులే ఎక్కువ అయ్యిపోయేలా ఉన్నాయి. పైగా ఈ సినిమాకి ఆల్రెడీ అన్ని రికార్డ్స్ బద్దలయ్యేలా కొందరు మాస్ ప్లాన్ లు కూడా చేస్తున్నారనీ గాసిప్స్ ఉన్నాయి.

అయితే జెన్యూన్ గా వచ్చే వసూళ్లు కట్ చేసినా ఈ సినిమాకి చేస్తున్న ఖర్చు మాత్రం గతంలో ఏ రీ రిలీజ్ కి  ఉన్నాయి. మరి ఇంతలా పర్సనల్ గా ఫ్యాన్స్ ఎందుకు తీసుకుంటున్నారో వారికే తెలియాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించగా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.