షాకింగ్ : బాలీవుడ్ డైరెక్టర్ కి యాక్సిడెంట్.?

మన తెలుగు నుంచి భారీ ఏక్షన్ సినిమాలు అందులోని స్టైలిష్ సీక్వెన్స్ లతో తీసేది ఎవరు అంటే మొహమాటం లేకుండా మొదట రాజమౌళి, నెక్స్ట్ త్రివిక్రమ్ తర్వాత సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు కోసం చెప్తారు ఇక కన్నడ నుంచి లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ యాడ్ అయ్యాడు.

అలాగే తమిళ్ నుంచి శంకర్, లోకేష్ కనగ్ రాజ్ తదితరులు ఉన్నారు. మరి మనకి ఉన్నట్టే హిందీ సినిమాలో కూడా ఓ దర్శకుడు భారీ ఏక్షన్ సినిమాలతో తన మార్క్ ని సెట్ చేసుకున్నాడు. మరి ఆ దర్శకుడు సింబా, సింగం లాంటి ఎన్నో ఏక్షన్ ఎంటర్టైనర్ లను ఇచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి అట.

మరి ఇప్పుడు తాను రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా కొన్ని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి తాను ప్రస్తుతం హైదరాబాద్ లోనే తన కొత్త సినిమాలో ఓ భారీ ఏక్షన్ అండ్ ఛేజింగ్ సీన్ ని తెరకెక్కిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం అయితే ఈ దర్శకుడు ఎల్ బి నగర్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక రీసెంట్ గానే ఈ దర్శకుడు చేసిన ఓ డిఫరెంట్ కామెడీ చిత్రం “సర్కస్” రిలీజ్ అయ్యింది కానీ అది అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో రణబీర్ కపూర్, పూజా హెగ్డే సహా ఎంతో మంది స్టార్స్ నటించారు.