జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌లో నిశ్చ‌య్ రిసెప్ష‌న్.. స్పెష‌ల్ పాస్ట్‌వ‌ర్డ్ ఉంటేనే ఎంట్రీ అట‌!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక-చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథునలగ్నంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.  ఈ వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హోటల్ ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్‌లో జరిగింది.  ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ సభ్యులందరూ ఈ వేడుకలో సందడి చేశారు. కాగా నేడు జేఆర్సీ కన్వెన్షన్‌లో నీహారిక – చైతన్య జొన్నలగడ్డ రిసెప్షన్‌ వేడుక జరుగుతోంది.  చైతన్య తరఫు వారు ఇవాళ బంధుమిత్రులకు ఇస్తున్న రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.  ప్రైవేట్‌ ఫంక్షన్‌గా జరుగుతున్న రిసెప్షన్‌ జరగుతోంది. కొద్ది మంది మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌ లోపలికి వెళ్లడానికి పాస్‌ వర్డ్‌ని క్రియేట్‌ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని  వైభవంగా అలంకరించారు.  కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు చేపట్టారు. అన్నీ పనులను నీహారిక సోదరుడు వరుణ్‌తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఇద్దరు పిల్లలు అకీర, ఆద్యలతో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. మెగా, అల్లు కుటుంబాల కలయికతో ఉదయ్‌విలాస్‌లో పండుగ వాతావరణం నెలకుంది. ఆ ఫోటోలను చూసుకుని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.  నిహారికను గత ఆదివారం కూడా పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. అయితే, ఆ రోజు నిహారిక అలంకరణలో ప్రత్యేకత ఉంది. ఆమె తన తల్లి పద్మజ పెళ్లి చీర కట్టుకుని మెగా ప్రిన్సెస్ ముస్తాబయ్యారు. ఈ చీర కూడా ఇప్పటిది కాదు.. 32 ఏళ్ల క్రితం నాటిదట. ఈ విషయాన్ని నీహారిక సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. 32 ఏళ్ల క్రితం నిశ్చితార్థం రోజున తన మదర్ ఈ చీరలో ముస్తాబైన ఫొటోను, తన ప్రస్తుత ఫొటోను పక్కపక్కన పెట్టి షేర్ చేశారు.

నీహారిక వివాహామాడిన చైతన్య గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు అన్న విషయం తెలిసిందే. అతడు వ్యాపారవేత్త కూడా. నీహారిక- చైతన్య జోడి ఫర్‌ఫెక్ట అంటూ మెగా అభిమానులతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.