ఇస్మార్ట్ అందాలను ప్రదర్శించి టాలీవుడ్ను కట్టిపడేసింది నిధి అగర్వాల్. నిధికి సక్సెస్ అంత ఈజీగా ఏమీ రాలేదు. సవ్యసాచితో చేసిన మొదటి ప్రయత్నం బెడిసి కొట్టగా.. రెండో ఛాన్స్గా మిస్టర్ మజ్నుతో వచ్చింది. ఈ సినిమా ఇంకా దారుణంగా దెబ్బ కొట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే పూరి జగన్నాదో ఓ అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సమయానికి పూరి కూడా ఘోరమైన పొజిషన్లోనే ఉన్నాడు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫ్లాపుల్లో ఉన్న రామ్, నిధి, పూరి జగన్నాద్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. పూరి మ్యానరిజంలో పూర్తిగా మారిపోయి రెచ్చిపోయి నటించిన రామ్కు కమర్షియల్ సక్సెస్ రుచి చూపించాడు. అదే విధంగా ఫ్లాపులు తప్పా సక్సెస్ చూడని నిధికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు పూరి. ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ కొట్టడంతో నిధి ఫేట్ మారిపోయింది. అలా వచ్చిన క్రేజ్ను సోషల్ మీడియా సాయంతో ఇంకా కాపాడుకుంటూ వస్తోంది.
అలా సినిమా హిట్టవ్వడంతో నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ప్రారంభించింది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు పిచ్చెక్కించడం ప్రారంభించింది. లాక్ డౌన్లో నిధి తన ఫోటోలతో దాడి చేసిన తీరుకు నెటిజన్లకు ఊపిరి కూడా ఆడలేదు. తాజాగా నిధి ఓ ఫోటోను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. బాత్ టబ్లో కూర్చుని స్నానం చేస్తూ దీర్ఘాలోచనలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇంతకీ ఆమె ఏం ఆలోచిస్తుందో మరి.