Dhee 14: ఢీ డాన్స్ షో పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నెటిజెన్స్… ఎప్పుడు ముగుస్తుంది రా బాబు అంటూ కామెంట్స్!

Dhee 14: బుల్లితెరపై ప్రసారం అవుతున్న డాన్స్ షో లలో ఢీ డాన్స్ షో కూడా చాలా గుర్తింపు పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమౌతున్న ఈ డాన్స్ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ టీవీలో మొదలైన ఢీ సీజన్ 14 అంతగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. ఈ సీజన్లో శేఖర్ మాస్టర్ జడ్జిగా లేకపోవటం ఒక కారణం అయితే సుధీర్, రష్మీ ఈ షోలో లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణం. జబర్దస్త్ తర్వాత ఆ రేంజిలో సుదీర్ ఢీ షో లో కామెడీ చేశాడు.

ఇప్పుడు ప్రసారం అవుతున్న ఢీ సీజన్ పోటీలకు కామెడీ పేరుతో చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి.ఈ షోలో అందరినీ నవ్వించడానికి ఆది ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.ఈ సీజన్లో కామెడీకి బదులు వారు చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు భరించలేక ఈ సీజన్ ఎప్పుడు ముగుస్తుంది అంటూ ప్రేక్షకులను నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే సీజన్లో అయినా ఢీ షోలో సుధీర్ రష్మీ లను కానీ లేదా వేరే ఆసక్తికరమైన జంట కనిపిస్తాయేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సీజన్ 14 పూర్తయిన తర్వాత వచ్చే సీజన్లో సుధీర్ రష్మీలను స్పెషల్ గా పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు మల్లెమాల వారి నుండి ఎటువంటి రెస్పాండ్ కాలేదు. వచ్చే సీజన్లో సుధీర్ రష్మీ లేకపోతే ఢీ డాన్స్ షో ఇంతటితో సమాప్తం అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రేక్షకుల కోరిక మేరకు మల్లెమాల వారు సుధీర్ రష్మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.