బ్రేకింగ్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ లకు సమన్లు

NCB summons Deepika Padukone, Sara Ali Khan, Shraddha Kapoor and Rakul Preet Singh

అనుకున్నదే జరిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. నిజానికి సుశాంత్ సింగ్ మృతి కేసు కాస్త డ్రగ్స్ కేసుకు టర్న్ అయిన సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించగా.. తను సంచలన నిజాలు అధికారుల మందు బయటపెట్టింది.

NCB summons Deepika Padukone, Sara Ali Khan, Shraddha Kapoor and Rakul Preet Singh
NCB summons Deepika Padukone, Sara Ali Khan, Shraddha Kapoor and Rakul Preet Singh

దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రకంపనాలు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లకు డ్రగ్స్ దందాతో సంబంధం ఉందని రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. వీళ్లందరితో పాటు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది.

అయితే.. దీపికా, సారా, శ్రద్ధా, రకుల్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు పంపిస్తారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఎన్సీబీ అధికారులు వీళ్లకు సమన్లు జారీ చేశారు. వీళ్లందరినీ మూడు రోజుల్లో డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆదేశించారు.

ఇప్పటి వరకు ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి, తన సోదరుడు సోవిక్, సుశాంత్ సింగ్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండా, ఆయన వ్యక్తిగత స్టాఫ్ దీపేశ్ సావంత్ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఇప్పటికే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాశ్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. తాజాగా దీపికకు కూడా పంపించారు. వాట్సప్ సంభాషణ ఆధారంగా వీళ్లందరికీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.