కొత్త వ్యాపారంలోకి నయనతార

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార గత ఏడాది తన ప్రియుడు, దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేసింది. పెళ్లి తర్వాత ఏడాది తిరగకుండానే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలని కన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కొత్త జీవితాన్ని సంపూర్ణంగా ఆశ్వాదిస్తుననారు. మరో వైపు ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నయనతార ప్రస్తుతం కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ బిజినెస్ లోకి తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి దిగుతున్నట్లుగా కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇప్పటికే నయనతార తన ఫ్రెండ్ తో కలిపి కాస్మోటిక్స్ వ్యాపారం లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు థియేటర్స్ వ్యాపారాన్ని భర్తతో కలిసి మొదలుపెట్టబోతుంది.

ఉత్తర చెన్నైలోని అగస్త్య థియేటర్స్ ని నయనతార తన ప్రొడక్షన్ హౌస్ రౌడీ పిక్చర్స్ పై కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అగస్త్య థియేటర్ 1967వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది. చెన్నై లో అత్యంత పాతకాలం నాటి థియేటర్స్ లో ఇది కూడా ఒకటి. శివాజీ గణేషన్, ఎంజీఆర్, రజినీకాంత్, దళపతి విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అందులో ప్రదర్శించబడ్డాయి.

ఈ థియేటర్ ని కరోనా కాలంలో 2020లో మూసేశారు. తరువాత నిర్వహణ బారం కావడంతో తిరిగి ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు నయనతార, విగ్నేష్ శివన్ కలిసి అగస్త్య థియేటర్స్ ని తీసుకొంటుందట. వాటిని కంప్లీట్ గా రీ మోడల్ చేసి 2 స్క్రీన్స్ థియేటర్స్ గా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. వెయ్యికి పైగా సీటింగ్ కెపాసిటీతో ఈ థియేటర్స్ ని సకల సౌకర్యాలతో మరల అందుబాటులో తీసుకురానున్నారంట. త్వరలో దీనికి సంబందించిన కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి పెళ్లి తర్వాత హీరోయిన్ గా లిమిటెడ్ గా సినిమాలు ఒప్పుకుంటూ తన ఫోకస్ అంతా పిల్లలని చూసుకోవడంతో పాటు వ్యాపారాలపై పెట్టడానికి నయనతార డిసైడ్ అయ్యిందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. తమిళం లో మాధవన్ తో మాత్రమే ప్రస్తుతం నయనతార మూవీ చేస్తోంది. మొత్తానికి ఓ వైపు ప్రొడక్షన్ హౌస్ తో సినిమాలు నిర్మించడంతో పాటు, థియేటర్స్ బిజినెస్ అలాగే కాస్మోటిక్స్ వ్యాపారంలో నయనతార బిజినెస్ విమెన్ గా ఫుల్ బిజీ అయ్యే ప్రయత్నంలో నయనతార ఉందని చెప్పాలి.