కామెడీ స్టార్స్ కోసం ఆదిని లైన్ లో పెట్టిన నాగబాబు!

Nagababu: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో ఆది కూడా ఒకరు. మొదట అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా ఉన్న ఆది తర్వాత తన టాలెంట్ తో అంచలంచెలుగా వెదుకుతూ టీం లీడర్ స్థానానికి చేరుకున్నాడు. ఆది జబర్దస్త్ కి వచ్చిన తర్వాత దాని రూపు రేఖలు మారిపోయాయి అనటంలో సందేహం లేదు. జబర్దస్త్ లో మెయిన్ టీం లీడర్ గా కొనసాగుతున్న అది గత కొంత కాలంగా కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

గత కొంతకాలంగా రెమ్యూనరేషన్ తక్కువగా ఉందని చెప్పి ఎంతోమంది కంటెస్టెంట్ లు జబర్దస్త్ నుండి మాటీవీ లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షో కి వెళ్తున్నారు. వారి లాగే ఆది కూడా రెమ్యునరేషన్ ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో మల్లెమాల వారు అందుకు అంగీకరించలేదని,దాని కారణంగా ఆది గత నెల రోజులుగా జబర్దస్త్లో కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియక ముందే ఆది మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్ షోలో పార్టిసిపెట్ చేయనున్నాడు అని ప్రచారం జరుగుతోంది.

జబర్దస్త్ నుండి ఇ వెళ్ళిన నాగబాబు కామెడీ స్టార్స్ షో లో జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆది జబర్దస్త్ లో చేయటం లేదని తెలిసిన వెంటనే నాగబాబు ఆదిని సంప్రదించి తనకి కావలసిన రెమ్యునరేషన్ ఇప్పించడానికి మా టీవీ యాజమాన్యం తో మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తొందరలోనే ఆది మా టీవీ లో కనిపించే అవకాశం ఉందని సమాచారం. కాకపోతే ఆది తన పేరు ముందు ఉన్న హైపర్ అనే పేరుని ఇంకెక్కడ వాడటానికి లేదు. ఎందుకంటే ఆ పేరు తనకి మల్లెమాల వారు పెట్టారు. అందువల్ల ఇక నుండి ఆది హైపర్ ఆది గా కాకుండా ఆది గా మాత్రమే మా టీవీ లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.