మిస్టరీ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సెన్సార్ రిపోర్ట్!?

ఒక ఊరికి సంబంధించిన వరుస చావులు.. వాటి వెనక ఉన్న కారణాలు.. మరి ఆ మిస్టరీ చిక్కుముడిని ఎవరు విప్పారు? అనే కథాంశంతో ‘విరూపాక్ష’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తన కమ్ బ్యాక్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారట ఆయన. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుదీర్ఘ విరామ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. బైక్ యాక్సిడెంట్ తర్వాత విరామ తీసుకొని మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ.

ఆయన హీరోగా రాబోతున్న కొత్త సినిమా విరూపాక్ష. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి మరింత ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా.. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా అప్ డేట్స్ వదులుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికేట్‌ రావడం విశేషం. ఇకపోతే ఈ మూవీ రన్‌ టైమ్‌ 2 గంటల 25 నిమిషాలు అని తెలిసింది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో క్లాస్, మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అన్ని సన్నివేశాలు ఉంటాయట. చూడాలి మరి.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..!?