IPL 2025: శ్రేయస్ మ్యాజిక్‌తో ఫైనల్‌కు పంజాబ్.. ముంబై పోరాటం వృధా!

ముంబయి ఇండియన్స్‌ను ఓడించి పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వెళ్లింది. భారీ లక్ష్యం ముందు సైతం కంగారు పడకుండా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ కేవలం 19 ఓవర్లలోనే చేధించింది. శ్రేయస్ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా వధేరా (48), ఇంగ్లిస్‌ (38) కూడా మంచి ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మ్యాచ్‌కు వర్షం కారణంగా ఆలస్యం అయినా, ముంబయి ఆటగాళ్లు స్కోరు చేసే విషయంలో మాత్రం తేడా చూపలేదు. తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్(44), బెయిర్‌స్టో, నమన్ ధీర్(37) అందరూ చక్కగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా తిలక్-సూర్య భాగస్వామ్యం పంజాబ్ బౌలర్లను బాగా కష్టపెట్టింది. చివర్లో నమన్ ధీర్ దూకుడు చూపడంతో స్కోరు 203కు చేరింది.

చేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడినప్పటికీ, జోష్ ఇంగ్లిస్, ప్రియాన్ష్ ఆకట్టుకునే ఆటతో స్కోరు పెంచారు. అయితే మిడిల్ ఓవర్స్‌లో రెండు వికెట్లు పడిపోయిన తర్వాత కాస్త ఒత్తిడి వచ్చింది. అదే సమయంలో కెప్టెన్ అయ్యర్ రంగంలోకి వచ్చి దూకుడు చూపించాడు. అతని హ్యాట్రిక్ సిక్స్‌లు, షాట్లు మైదానంలో జోష్ నింపేశాయి. వధేరా కూడా మంచి సహకారం అందించాడు.

చివర్లో మరో రెండు వికెట్లు కోల్పోయినా, శ్రేయస్ నిలకడగా నిలిచిన విధానం మెప్పించింది. ఓవర్‌నై ఓవర్‌లో స్పష్టంగా ప్లాన్‌తో ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించాడు. ఇదే సరైన లీడర్‌గానే కాక, మ్యాచ్ ఫినిషర్‌గానూ అతని పేరు నిలిచిపోయింది. ఇక ఫైనల్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్న రెండు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి.

దివ్యభారతి ఎఫైర్ | Director Geetha Krishna EXPOSED Divya Bharti & Silk Smitha Affairs ||TeluguRajyam