Sai Dharam Tej: కేజీఎఫ్ చాప్టర్ 2 పై ఆసక్తి కరమైన ట్వీట్ చేసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..!

Sai Dharam Tej: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే కన్నడ ఇండస్ట్రీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. హీరో యశ్ పాపులారిటీ కూడా అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకూ మామూలు హీరోగా ఉన్న యశ్ సడెన్ గా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు అంటే కారణం కేజీఎఫ్.

ఇక అదే ఉత్సాహంతో ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ చాప్టర్ 2 ను కూడా తెరకెక్కించడం చెప్పుకోదగిన అంశం. చాప్టర్ 1 భారీ హిట్ కొట్టడంతో, ఇపుడు చాప్టర్ 2 పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఉంటుందని ఇప్పటికే అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది. మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ లోకంలో ఉన్న వీక్షకులను, సడెన్ గా కేజీఎఫ్ తన వైపు తిప్పుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం అందుకు తగ్గట్టుగానే వినోదాన్ని అందిస్తోందని పలువురు భావిస్తున్నారు.

ఇక కేజీఎఫ్ 1 చూసిన ప్రతీ ఒక్కరూ చాప్టర్ 2 కోసం ఇన్ని రోజులూ ఎంత గానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అనౌన్స్ చేసిన దగ్గరి నుంచీ, ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తో వారి వెయిటింగ్ కి తెరపడింది. ఇన్ని రోజులూ వెయిట్ చేసినందుకు ఫలితం దక్కిందని వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ చూసిన మామూలు ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా ఈ మూవీపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కేజీఎఫ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగించారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 తో మరోసారి భారతీయ సినిమా అందర్నీ ఆకట్టుకోవాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆయన తరపున విషెస్ తెలిపారు.