ట్రాక్ ఎక్కిన రకుల్ ప్రీత్ సింగ్ .. మెగా హీరోలే ఆదుకున్నారట .?

రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో కాస్త లాంగ్ గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. వరుస ఫేయిల్యూవర్స్ లో ఉన్న రకుల్ కి నాగార్జున మన్మధుడు 2 ఇంకా గట్టి షాకిచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో అవకాశాలు రావని ఇక రకుల్ ప్రీత్ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్టే అనుకున్నారు. కాని క్రిష్ రకుల్ కి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చాడు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రకుల్ ని ఎంచుకోవడం ఎవరూ ఊహించనిది. ఇంతకముందు ఎక్కువగా మెగా హీరోల సినిమాలలోనే నటించి స్టార్ స్టేటస్ సాధించిన రకుల్ ఇప్పుడు కూడా కెరీర్ డౌన్ ఫాల్ లో ఉండగా మెగా హీరో సినిమానే ఆదుకుంది.

Delhi HC seeks Centre's stand on Rakul Preet's plea against media linking  her to Rhea Chakraborty drug case - OrissaPOST

అంతేకాదు రకుల్ కి టాలీవుడ్ లో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. యంగ్ హీరో నితిన్ నటించబోతున్న సినిమాలో కూడా రకుల్ కి ఛాన్స్ వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ అన్న టైటిల్ తో ఒక సినిమా ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో ఛాన్స్ దక్కించుకొని రకుల్ మళ్ళీ టాలీవుడ్ లో ట్రాక్ ఎక్కింది. ఇలా రకుల్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో ఛాన్స్ దక్కించుకోగానే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలామంది చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

అంతేకాదు రకుల్ కి మరో రెండు సినిమాలలో అవకాశాలు వచ్చినట్టు సమాచారం. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోతున్న సినిమా అని అంటున్నారు. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించబోయో సినిమాలో కూడా రకుల్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకి సంబంధించిన అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాగా శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 లో కూడా రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రెండు బాలీవుడ్ సినిమాలు చేతిలో ఉన్నాయి.