“గుడుంబా శంకర్” రీరిలీజ్..పవన్ పై మీరా జాస్మిన్ పోస్ట్.!

లేటెస్ట్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ కి వస్తున్నా లేటెస్ట్ చిత్రాల్లో టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “గుడుంబా శంకర్” కూడా ఒకటి. మరి రీ రిలీజ్ లో బుకింగ్స్ లో కూడా అదరగొట్టిన ఈ చిత్రం ఉన్న డిమాండ్ మేర అయితే మొదట అనుకున్న డేట్ కన్నా ముందే రిలీజ్ కి తీసుకొచ్చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

కాగా ఈ చిత్రం విషయంలో ఈ సినిమా హీరోయిన్ మీరా జాస్మిన్ లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. కాగా ఇందులో తమ ఇద్దరి మధ్య అలనాటి పిక్స్ ని ఇప్పటివరకు ఎవరూ చూడని వాటిని షేర్ చేసి పవన్ తో వర్క్ కోసం కానీ గుడుంబా శంకర్ సినిమా షూటింగ్ టైం స్మృతులతో అయితే నెమరు వేసినట్టుగా తెలిపింది. గుడుంబా శంకర్ నాటి జ్ఞ్యాపకాలకు ఒక నిధిలా తాను దాచుకున్నాను అని.

అయితే పవన్ కోసం మాట్లాడుతూ తనతో వర్క్ కానీ తన ఆలోచనలు భవిష్యత్తు కోసం చెప్పే మాటలు నడవడిక నాలోని నెగిటివిటి తగ్గించేందుకు ఎంతో సహయ పడ్డాయి అని అలాగే తానొక మంచి మనిషి తానెప్పుడూ బాగుండాలని కోరుకుంటూ గుడుంబా శంకర్ రిలీజ్ ని సక్సెస్ చేయాలి అని తెలిపింది. దీనితో మీరా జాస్మిన్ పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మరి ఫ్యాన్స్ ని మరింత ఆనందానికి లోను చేస్తుంది.