పెళ్లి పీటలెక్కిన మీరాచోప్రా!

బాలీవుడ్‌ నటి మీరాచోప్రా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన రక్షిత్‌ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో మీరాచోప్రా మంగళవారం ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరుగగా మీరాచోప్రా తన వివాహ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది.

ఇక ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా.. మీరాచోప్రాకు కజిన్లు. చోప్రా కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి ప్రియాంక చోప్రా రాలేదు. పవన్‌ కళ్యాణ్‌ ‘బంగారం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీరాచోప్రా. ఆ తర్వాత ‘వానస’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీరాచోప్రా ప్రస్తుతం ‘సఫేద్‌’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.