లేటెస్ట్ : “బ్రహ్మాస్త్ర” సీక్వెల్స్ పై మాసివ్ అప్డేట్స్.!

బాలీవుడ్ సినిమా దగ్గర భారీ అంచనాలతో వచ్చిన పలు బిగ్గెస్ట్ సినిమాలో గత ఏడాది వచ్చిన మాసివ్ చిత్రాల్లో “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా దర్శకుడు అయాన్ ముఖర్జీ అయితే ఈ సినిమాని ఇండియన్ సినిమా దగ్గర ఓ బెస్ట్ విజువల్స్ ఎఫెక్ట్స్ కలిగిన సినిమాగా నిలిచింది.

అయితే ఈ సినిమా అంత రేంజ్ హిట్ కాలేదు కానీ 400 కోట్లకి పైగా గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. మరి ఆల్రెడీ మేకర్స్ ఈ సినిమాని మొత్తం మూడు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాపై ఇప్పుడు మాసివ్ అప్డేట్స్ ని అందించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలలో రెండో భాగాన్ని అయితే ఈ 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేయగా అలాగే మూడో సినిమాని అయితే 2027 డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ ఏడాది నుంచి పార్ట్ 2 రిలీజ్ కి ఇంకా మూడేళ్లు ఉందని చెప్పాలి. అయితే ఈ మూడేళ్ళలో రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఒకేసారి కంప్లీట్ చేయనున్నారట. అందుకే ఇంత సమయం తీసుకుంటున్నట్టుగా బిగ్ అప్డేట్ ని అందించారు.

దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఈరోజు బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాల్లో మరింత బిగ్ స్టార్స్ నటించనున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాలో అయితే షారుఖ్ ఖాన్, అమితాబ్, కింగ్ నాగార్జున లాంటి బిగ్ స్టార్స్ కనిపించారు.