మరొకసారి అనారోగ్యం పాలైన మమతా మోహన్ దాస్… వైరల్ అవుతున్న పోస్ట్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు అరుదైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్యం పాలై సినిమా ఇండస్ట్రీకి దూరం ఇలా అనారోగ్యం వల్ల సినిమాలకు దూరమైన సెలబ్రిటీలు కొంతకాలం తర్వాత ఆ వ్యాధుల నుండి కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీలో రీఎంట్రీ అలాంటి సెలబ్రిటీలలో మమత మోహన్ దాస్ కూడా ఒకరు.యమదొంగ , కేడి, చింతకాయల రవి వంటి ఎన్నో సినిమాలలో నటించి గుర్తింపు పొందిన మమత మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు తెలుగులో మంచి హిట్ సినిమాలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. అయితే క్యాన్సర్ వ్యాధి సోకటంతో కొంతకాలం సినిమాలకు దూరం అయింది.

క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకొని తర్వాత ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీ అయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి లింఫోమా అనే వ్యాధి సోకింది. దీంతో మమతా మోహన్ దాస్ మళ్లీ సినిమాలకు దూరమై చికిత్స తీసుకొని ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంది. ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత మమత మళ్లీ సినిమాలలో నటించడం ప్రారంభించింది. తమిళ్ మలయాళీ భాషలలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇలా క్యాన్సర్, లింఫోమా వ్యాధులతో పోరాడి బయటపడ్డ మమతా మోహన్ దాస్ ఇటీవల మరొకసారి కూడా అనారోగ్యం పాలైంది.

ఈ విషయాన్ని మమత మోహన్ దాస్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా బ్లాక్ కలర్ సూట్ లో మేకప్ లేకుండా ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ డిసీజ్ వల్ల తన చర్మం రంగు కోల్పోయిందని తెలియజేసింది. ఈ వ్యాధి నుండి బయటపడటానికి డి విటమిన్ చాలా అవసరం అని అందువల్ల ప్రతిరోజు ఉదయం సూర్యుడి ముందు కూర్చుంటాను. సూర్య కిరణాలు శరీరానికి తాకినప్పుడు డి విటమిన్ గ్రహించి ఆ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఉంటుందని మమతా మోహన్ దాస్ ఈ సందర్భంగా తెలియజేసింది. అయితే మమత మోహన్ దాస్ మరొకసారి ఇలా అనారోగ్యం పాలవటంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యం నుండి తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.