ఉదయ్ కిరణ్ కు ఘన నివాళులు అర్పించిన మల్లెమాల.. కంటతడి పెట్టుకున్న అభిమానులు!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. అయితే ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేక ఈవెంట్లతో పలు ఛానల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంటాయి.ఈ క్రమంలోని రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈటీవీ వాళ్ళు హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా మల్లెమాలవారు నిర్వహించడంతో ఈ కార్యక్రమంలో టీవీ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్లు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరించారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అన్నయ్యలకు చెల్లెళ్లు అక్కలు రాఖీలు కట్టి రాఖీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మల్లెమాలవారు దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ను గుర్తుచేసుకొని ఆయనకు ఘన నివాళి అర్పించడమే కాకుండా అభిమానులందరికీ కంటతడి పెట్టేలా చేశారు.ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంత ఎత్తుకు ఎదగారో అంతే తక్కువ సమయంలో అతని కెరియర్ లో ఫెయిలవడం అవకాశాలు లేక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికి అభిమానులను ఎంతగానో కృంగదీస్తుంది.

ఈ క్రమంలోనే బుల్లితెర నటుడు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి విజయాలను అందుకున్నారు. అనంతరం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొని చివరికి ఎలా చనిపోయారు అనేది ఒక స్కిట్ రూపంలో చేసి అందరి చేత కంటతడి పెట్టించారు. ఈ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతూ ఉదయ్ కిరణ్ కు ఘన నివాళి అర్పించారు. ఇకపోతే మనసంతా నువ్వే సినిమాలో భాగంగా ఉదయ్ కిరణ్ చెల్లెలు పాత్రలో నటించిన వ్యక్తి ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ క్రమంలోనే అప్పటి విషయాలను గుర్తుచేసుకొని ఈమె కంటతడి పెట్టుకుంది.ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ నాతో మాట్లాడుతూ నువ్వు మీ ఇంట్లో మీ అన్నయ్యతో ఎలా ఉంటారో,నాతో కూడా అలాగే ఉండు అని చెప్పారు. ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తుందని చెబుతూ అందరిని ఏడిపించింది.