Mahesh Babu: మహేష్ చేసిన ఆ పనిని ఎలా మర్చిపోతావ్ బోయపాటి అంటూ… ఫైర్ అవుతున్న మహేష్ ఫ్యాన్స్!

Mahesh Babu:మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మహేష్ బాబు అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు బోయపాటి శ్రీను పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.యాక్షన్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బోయపాటి శీను తాజాగా సూర్య నటించిన ఈటీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి బోయపాటి శీను, దగ్గుబాటి రానా, గోపీచంద్ మలినేని వంటివారు హాజరయ్యారు.ఈ సందర్భంగా బోయపాటి శ్రీను ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ మహేష్ బాబు అభిమానులను హార్ట్ చేశారని చెప్పవచ్చు.

ఈ సందర్భంగాబోయపాటి మాట్లాడుతూ గతంలో తాను సూర్య ఒక ఇంటర్వ్యూ చూశానని ఎవరైతే గుండె సమస్యతో బాధపడుతున్నారు అలాంటివారు తనని కాంటాక్ట్ అయితే వారికి ఉచిత గుండె ఆపరేషన్ చేయిస్తానని చెప్పినట్లు ఈ సందర్భంగా గతంలో చేసిన విషయాన్ని ఈ వేదికపై వెల్లడించారు.ఇలా ఎంతో మంది పేదలకు గుండె ఆపరేషన్ చేయించడం చాలా మంచి విషయం అని ఇది మిమ్మల్ని కాకుండా మీ పిల్లలను కూడా కాపాడుతుందని ఈయన సూర్య పై ప్రశంసలు కురిపించారు.

అలాగే బోయపాటి శ్రీను మాట్లాడుతూ తెలుగులో కూడా బాలకృష్ణ బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్ లను కాపాడారని అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతో మందికి ఆపద సమయంలో బ్లడ్ అందిస్తూ… పేదలకు సహాయం చేస్తున్నారంటూ ఈ వేదికపై బోయపాటి శ్రీను హీరోల గురించి ప్రశంసలు కురిపించారు.ఇలా చిరంజీవి బాలకృష్ణ గురించి ప్రస్తావించిన బోయపాటికి 1200 గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ బాబు గుర్తు రాలేదా? అంటూ మహేష్ బాబు అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిన విషయాన్ని ఎక్కడా చెప్పకుండా ఎంతో మందికి సహాయం చేస్తున్న మహేష్ బాబు గురించి గత కొద్ది రోజులుగా బాలకృష్ణ టాక్ షో ద్వారా ఈ విషయం బయట పెట్టారు. ఇలా ఎంతో మంది చిన్నారుల గుండె చప్పుడును కాపాడిన మహేష్ బాబుని ఎలా మర్చిపోతావ్ బోయపాటి అంటూ మహేష్ బాబు అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై బోయపాటి ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.