ద‌ర్శ‌కుడి పెళ్ళి రోజు.. రూపాయికే లిక్కర్ అని ప్ర‌క‌టించిన అభిమాని

అభిమానం అనేది కొంద‌రిలో ఒక్కోర‌కంగా ఉంటుంది. అభిమాన స్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొంద‌రు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే మ‌రి కొంద‌రు విచిత్ర కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఎన్. శంకర్ అభిమాని ఒకరు ఈ ద‌ర్శ‌కుడి పెళ్ళి రోజు సంద‌ర్భంగా బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ళ పెడుతున్నారు.

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఒక్క రూపాయికే క్వార్టర్ బాటిల్‌కు విక్రయించారు. క‌రోనా క‌ష్ట కాలంలో మ‌ధ్యం ధ‌ర‌లు భారీగా పెర‌గ‌గా, ఇప్పుడు రూపాయికే క్వార్ట‌ర్ మద్యం దొరుకుతుంద‌ని అన‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంటుంది. గద్వాల జిల్లాకు చెందిన ఓ అభిమాని త‌న అభిమాన డైరెక్టర్ పెళ్లి రోజు సంద‌ర్భంగా మ‌ద్యం పంపిణీ చేశాడు. అది కూడా ఒక్క రూపాయికే. మందుబాబుల‌కి ఆనందం నింపేందుకు రూపాయికి క్వార్ట‌ర్ ప్ర‌క‌టించ‌డంతో అంతా బారులు తీరారు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా చింత‌కుంట విష్ణు పని చేస్తున్నారు. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్ శంక‌ర్‌పై ఉన్న చాలా అభిమానంతో ఒక్క రూపాయికే మద్యం పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం గంట పాటు ఎస్వీ వైన్ షాపు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ విష‌యం తెలుసుకొని మందుబాబులు అక్కడ బారులు తీరారు. గంట పాటే ఈ పంపిణీ కార్యక్ర‌మం చేప‌ట్ట‌డంతో కొంద‌రు మందు బాబులు నిరాశ చెందారు. అయితే 60 మందికి ఆఫీసర్‌ చాయిస్‌ క్వాటర్‌ మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు విష్ణు. వీటి విలువ రూ.8,340. అనంతరం మరో 200 మందికి అన్నదానం కూడా చేశారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు