బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతి సనన్

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ కృతి సనన్. ఈ బ్యూటీ చివరిగా యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకొచ్చిన ఆదిపురుష్ చిత్రంలో సీతాదేవిగా కనిపించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. బాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కృతి సనన్ కూడా ఒకరిని చెప్పాలి.

ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా చేసిన షెహజాదా, ఆదిపురుష్ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ కి జోడీగా గణపత్ 2 లో ఆమె నటిస్తోంది. అలాగే ది క్రూ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాదిలోనే ఆ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కృతి సనన్ సొంతం చేసుకుంది. వెటరన్ స్టార్ హీరోయిన్, చిన్న వయస్సులోనే బాలీవుడ్ ని ఏలిన నటి మీనాకుమారి బయోపిక్ లో నటించడానికి కృతి సనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. తన డెబ్యూ మూవీగా మీనాకుమారి బయోపిక్ ని అతను ఎంపిక చేసుకున్నారు.

ఇక ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తోంది. మనీష్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్లోనే నిర్మించనున్నారంట. త్వరలో ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే ఛాన్స్ ఉందంట. మీనాకుమారి టీనేజ్ లోనే హీరోయిన్ అయ్యి ఏకంగా 150 చిత్రాలలో నటించింది. 38 ఏళ్ళకే ఆమె అనారోగ్యంతో మృతి చెందింది.

ఆ నటి కథలో ఎన్నో కోణాలు ఉన్నాయని, చిన్న వయస్సులో హీరోయిన్ అవ్వడం నుంచి ఆమె మరణాం వరకు కథని మనీష్ మల్హోత్రా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టోరీ కోసం వారి కుటుంబ సభ్యుల పర్మిషన్ కూడా తీసుకోవడంతో పాటు చాలా రీసెర్చ్ చేసినట్లుగా బిటౌన్ లో వినిపిస్తోంది.