అందాల ఆరబోతలో కృతిసనన్‌!

బాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర నటీమణుల్లో వున్న కృతి సనన్‌ అందాల ఆరబోతలో ముందున్నది. తన అందచందాలతో కుర్రాకారును పిచ్చెక్కిస్తోంది. మొదటి సినిమా తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరసన ‘1: నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా నటించింది. కృతి సనన్‌ ఆ తరువాత మరొక్క తెలుగు సినిమా మాత్రమే చేసింది. తరువాత హిందీ పరిశ్రమకి వెళ్ళిపోయింది. గ

త సంవత్సరం కృతి సనన్‌ నటించిన మూడు హిందీ సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో.. ’ సినిమాని హిందీలో రీమేక్‌ చేశారు. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడు. ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నడవలేదు. త

రువాత తెలుగు నటుడు ప్రభాస్‌ తో పాన్‌ ఇండియన్‌ సినిమాగా ‘ఆదిపురుష్‌’ లో సీతామాతగా కృతి సనన్‌ చేసింది. కానీ ఈ సినిమాకి వచ్చినన్ని విమర్శలు ఇంకే సినిమాకీ రాలేదేమో అనిపిస్తుంది. తరువాత \గణపత్‌’ అని ఇంకో సినిమా విడుదలైంది.

టైగర్‌ ష్రాఫ్‌ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడితే, కృతి సనన్‌ కథానాయికగా నటించింది. ఇందులో లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. అయినా ఈ సినిమా కూడా బాక్సాఫీష్ వద్ద చతికల బడిరది. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే, గత సంవత్సరం జాతీయ అవార్డు అందుకున్న వాళ్లలో కృతి సనన్‌ కూడా వుంది. \మిమి’ సినిమాలో ఆమె చేసిన పాత్రకి గాను ఉత్తమ నటిగా కృతి సనన్‌ ఈ జాతీయ అవార్టు అందుకుంది.

ఈ సంవత్సరం కృతి సనన్‌ సినిమా ‘తెరి బాతొన్‌ మె ఐసా ఉజా జియా’ వచ్చేనెల అంటే ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. షాహిద్‌ కపూర్‌ కథానాయకుడు, ఇందులో కృతి సనన్‌ ఒక రోబోట్‌ గా కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్‌, పాటలు చూస్తే ఆమె రోబోట్‌ గా చేసింది అని అర్థం అవుతోంది.

ఈ సినిమా ప్రచారాలు మొదలుపెట్టేసింది కృతి సనన్‌. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందని, కృతి సనన్‌ ఈ సంవత్సరం విజయంతో మొదలు పెడుతుందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.