సీతమ్మ పాత్రలో చేయడానికి నెర్వస్ గా ఫీలయ్యా.. కృతి సనన్ కామెంట్స్ వైరల్!

మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమా ద్వారా ఆడి పాడి సందడి చేసిన ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను సందడి చేసిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత నాగచైతన్య సరసన మరో సినిమాలో నటించిన కృతి సనన్ రెండవ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను సందడి చేయలేకపోవడంతో ఈమె తెలుగు తెరకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న కృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా కృతి సనన్ మాత్రం సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తికాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… హిందూ ధర్మం ప్రకారం సమాజంలో ఎంతో గౌరవంగా పిలవబడి ఎన్నో పూజలు అందుకుంటున్న సీతమ్మ పాత్రలో చేయడానికి తాను చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యానని, అదేవిధంగా తాను అలాంటి ఓ గొప్ప పాత్రలో నటిస్తున్నందుకు చాలా బాధ్యతగా కూడా భావించానని ఈ సందర్భంగా కృతి సనన్ సీత పాత్ర గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.